ఖతార్లో ఆర్థిక మోసాల గురించి హెచ్చరిక జారీ..!!
- July 10, 2025
దోహా, ఖతార్: ఖతార్లో ఆర్థిక మోసాల గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) హెచ్చరిక జారీ చేసింది. పెట్టుబడిదారులు, పౌరులు, నివాసితులకు ఏదైనా పెట్టుబడి కార్యకలాపాలలో పాల్గొనడం, ఒప్పందాలపై సంతకం చేయడం లేదా పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నట్లు చెప్పుకునే కంపెనీలు లేదా సంస్థలకు నిధులను బదిలీ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి హెచ్చరించింది.
ఏదైనా లైసెన్స్ లేని పార్టీకి నిధుల సేకరణ కార్యకలాపాలను నిర్వహించడానికి లేదా ప్రజలకు పెట్టుబడి సేవలను అందించడానికి చట్టబద్ధంగా అధికారం లేదని స్పష్టం చేసింది. అలాంటి సంస్థలతో కలిసి పనిచేస్తే పెట్టుబడిదారులు చట్టపరమైన, ఆర్థిక నష్టాలకు గురవుతారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏదైనా ఒప్పందాలు లేదా లావాదేవీలు కుదుర్చుకునే ముందు ఏదైనా వ్యక్తి లేదా సంస్థ చట్టబద్ధత , లైసెన్సింగ్ స్థితిని ధృవీకరించుకోవాలని.. మరింత సమాచారం కోసం అధికారిక మార్గాల ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







