యూఏఈలో UPI: త్వరలో ఫోన్ల ద్వారా పేమెంట్స్..!!
- July 11, 2025
యూఏఈ: యూఏఈకి వచ్చే భారతీయులు త్వరలో నగదు, కార్డులు లేదా చెల్లింపు సాధనాలు తేవాల్సిన అవసరం లేదు. కేవలం వారి పాస్పోర్ట్లు, ఫోన్ ఉంటే చాలు. వాటితోనే పేమెంట్స్ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ..అన్ని ఆర్థిక లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో చెల్లింపు చేసే రోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. యూఏఈలో UPI విస్తరణ జరుగుతుందన్నారు.
అయితే, యూఏఈలో UPI చెల్లుబాటు అనేది NPCI ఇంటర్నేషనల్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. లులు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ వంటి ప్రధాన రిటైల్ చైన్స్ ఇప్పటికే యూపీఐని అందుబాటులోకి తీసుకువచ్చాయి. భారతీయ సందర్శకులు ఇప్పుడు తమ భారతీయ బ్యాంకు ఖాతాల నుండి నేరుగా చెల్లించడానికి మొబైల్ యాప్లను ఉపయోగించవచ్చు. తదుపరి దశలో యూఏఈ స్థానిక చెల్లింపు వ్యవస్థ AANIతో భాగస్వామ్యం ఏర్పాటు.. రెండు దేశాల మధ్య డిజిటల్ ఆర్థిక కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!









