యూఏఈలో UPI: త్వరలో ఫోన్ల ద్వారా పేమెంట్స్..!!
- July 11, 2025
యూఏఈ: యూఏఈకి వచ్చే భారతీయులు త్వరలో నగదు, కార్డులు లేదా చెల్లింపు సాధనాలు తేవాల్సిన అవసరం లేదు. కేవలం వారి పాస్పోర్ట్లు, ఫోన్ ఉంటే చాలు. వాటితోనే పేమెంట్స్ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ..అన్ని ఆర్థిక లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో చెల్లింపు చేసే రోజులు త్వరలోనే వస్తాయని పేర్కొన్నారు. యూఏఈలో UPI విస్తరణ జరుగుతుందన్నారు.
అయితే, యూఏఈలో UPI చెల్లుబాటు అనేది NPCI ఇంటర్నేషనల్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. లులు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ వంటి ప్రధాన రిటైల్ చైన్స్ ఇప్పటికే యూపీఐని అందుబాటులోకి తీసుకువచ్చాయి. భారతీయ సందర్శకులు ఇప్పుడు తమ భారతీయ బ్యాంకు ఖాతాల నుండి నేరుగా చెల్లించడానికి మొబైల్ యాప్లను ఉపయోగించవచ్చు. తదుపరి దశలో యూఏఈ స్థానిక చెల్లింపు వ్యవస్థ AANIతో భాగస్వామ్యం ఏర్పాటు.. రెండు దేశాల మధ్య డిజిటల్ ఆర్థిక కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







