బాక్సాఫీస్ పై దండయాత్రకు OG సిద్ధం!
- July 11, 2025
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులను గంభీర అవతారంలో కట్టిపడేయబోతున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న OG షూటింగ్ పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ, దుమ్ము రేపే కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. వర్షంలో తడుస్తూ కూడా, ఆ పోస్టర్లో పవన్ కల్యాణ్ చూపించిన యాటిట్యూడ్ అభిమానుల్లో కొత్త ఊపును రేపుతోంది.
కాగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలోకి ఎంటర్ అయ్యింది.ఇక ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ తో ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇమ్రాన్ హాష్మీ, ప్రియాంక అరూల్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్ థమన్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అందిస్తుండగా, DVV దానయ్య, కళ్యాణ్ దాసరి డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రపంచాన్ని ఊపేసిన RRRను నిర్మించిన అదే బ్యానర్ కాబట్టి, OG 2025లోనే అతి పెద్ద సినిమా ఈవెంట్గా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..







