సెలవును కోల్పోయిన మాజీ ఉద్యోగికి Dh59,000 పరిహారం..!!
- July 11, 2025
యూఏఈ: అబుదాబిలోని కాసేషన్ కోర్టు 13 సంవత్సరాల పాటు వార్షిక సెలవులను వినియోగించుకోని ఎంప్లాయికి పరిహారం చెల్లించాలని యజమానిని ఆదేశించింది. ఈ కేసులో 2009 నుండి జూన్ 2022లో తన ఒప్పందం ముగిసే వరకు కంపెనీలో పనిచేసిన సదరు ఉద్యోగి తన పదవీకాలంలో అర్హత కలిగిన వార్షిక సెలవును ఎప్పుడూ తీసుకోలేదని పేర్కొన్నాడు. ఇందుకు గాను ఆర్థిక పరిహారం అందజేయాలని కోరాడు. అయితే, యజమాని సెలవులు తీసుకున్నట్లు ఏ డాక్యుమెంటేషన్ను అందజేయలేదు. దాంతో సదరు ఉద్యోగికి Dh59,290 పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించింది.
అంతకుముందు, కేసు నంబర్ 2024/73లో దిగువ కోర్టు ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ పరిహారాన్ని గరిష్టంగా రెండు సంవత్సరాల వార్షిక సెలవులకే పరిమితం చేసింది. అయితే, కాసేషన్ కోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసి, మొత్తం కాలానికి పూర్తి పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు హబీబ్ అల్ ముల్లా అండ్ పార్టనర్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ హబీబ్ అల్ ముల్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ తీర్పు యూఏఈలో ఉపయోగించని సెలవులకు సంబంధించిన కార్మిక వివాదాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. డిసెంబర్ 2024లో కాసేషన్ కోర్టు ఈ తీర్పును ప్రకటించిందని తెలిపారు. అలాగే, కొచ్చర్ & కో. ఇంక్. లీగల్ కన్సల్టెంట్స్ (దుబాయ్ బ్రాంచ్)లో సీనియర్ అసోసియేట్ నవన్దీప్ మట్టా ఈ నిర్ణయాన్ని యూఏఈ ఉపాధి చట్టంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.
2021 ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 33లోని ఆర్టికల్ 29 మరియు 2022 క్యాబినెట్ తీర్మాన నంబర్ 1 ప్రకారం.. ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత ఉపయోగించని సెలవులకు చట్టబద్ధంగా పరిహారం పొందేందుకు అర్హులు అని మట్టా వివరించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు







