సింథటిక్ డ్రగ్ ల్యాబ్ కేసు.. నిందితుడిని భారత్ కు అప్పగించిన యూఏఈ..!!
- July 12, 2025
యూఏఈః ఇండియాలో నమోదైన మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడిని యూఏఈ అప్పగించినట్లు భారత అధికారులు తెలిపారు. సింథటిక్ డ్రగ్ తయారీ కేంద్రాన్ని నిర్వహించడంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కుబ్బవాలా ముస్తఫాను భారతదేశ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఇంటర్పోల్, అబుదాబిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సమన్వయంతో భారతదేశానికి అప్పగించారు.
CBI విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ముంబై పోలీసుల నలుగురు సభ్యుల బృందం ఈ వారం ప్రారంభంలో దుబాయ్ వెళ్లి జూలై 11న ముస్తఫాను తిరిగి ముంబైకి తీసుకువచ్చింది.
ముస్తఫాపై 2024లో ముంబైలో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో సింథటిక్ డ్రగ్ ల్యాబ్ను నడుపుతున్నట్లు కేసు నమోదు చేశారు. అక్కడి నుండి 126 కిలోలకు పైగా మెఫెడ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం 2024 నవంబర్లో ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. జూన్లో NCB-అబుదాబి నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు ముందుకువచ్చింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







