సింథటిక్ డ్రగ్ ల్యాబ్ కేసు.. నిందితుడిని భారత్ కు అప్పగించిన యూఏఈ..!!
- July 12, 2025
యూఏఈః ఇండియాలో నమోదైన మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడిని యూఏఈ అప్పగించినట్లు భారత అధికారులు తెలిపారు. సింథటిక్ డ్రగ్ తయారీ కేంద్రాన్ని నిర్వహించడంలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కుబ్బవాలా ముస్తఫాను భారతదేశ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఇంటర్పోల్, అబుదాబిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సమన్వయంతో భారతదేశానికి అప్పగించారు.
CBI విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ముంబై పోలీసుల నలుగురు సభ్యుల బృందం ఈ వారం ప్రారంభంలో దుబాయ్ వెళ్లి జూలై 11న ముస్తఫాను తిరిగి ముంబైకి తీసుకువచ్చింది.
ముస్తఫాపై 2024లో ముంబైలో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని సాంగ్లిలో సింథటిక్ డ్రగ్ ల్యాబ్ను నడుపుతున్నట్లు కేసు నమోదు చేశారు. అక్కడి నుండి 126 కిలోలకు పైగా మెఫెడ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం 2024 నవంబర్లో ఇంటర్పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. జూన్లో NCB-అబుదాబి నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు ముందుకువచ్చింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







