కువైట్ లో వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం..!!
- July 12, 2025
కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై అవగాహన ప్రచారం ప్రారంభమైంది. “వాతావరణ మార్పుతో మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోండి” అనే పేరుతో జరుగుతున్న అవగాహన ప్రచారాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. వేసవి అంతా జరిగే ఈ ప్రచారం.. వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యంపై పడే ప్రభావాలను హైలైట్ చేస్తుంది. పర్యావరణం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.
క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా దేశాలను ప్రభావితం చేస్తున్నాయని, వాతావరణ మార్పు ప్రస్తుతం అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యల అని ప్రజారోగ్య సహాయ కార్యదర్శి డాక్టర్ ముంథర్ అల్-హసావి అన్నారు. వాతావరణ మార్పులు ఆరోగ్య ప్రభావాల చూపే సమస్యలపై అవగాహన పెంచడానికి, వాటిని క్రమంగా తగ్గించడానికి విధానాలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఆరోగ్య ప్రమోషన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అబీర్ అల్-బుహు మాట్లాడుతూ.. ఈ ప్రచారంలో ఆరోగ్యకరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, వాతావరణ మార్పులు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాత మోడల్స్, సముద్ర మట్టాలు పెరగడం వంటి వాటి గురించి అవగాహన పెంచడానికి వర్క్షాప్లు, లెక్చర్స్,ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







