బార్డర్ ఇష్యూస్ పై చర్చించిన ఖతార్, సౌదీ అరేబియా..!!
- July 12, 2025
దోహా: ఖతార్ - సౌదీ అరేబియా మధ్య మూడవ సమన్వయ సమావేశం దోహాలో జరిగింది. సరిహద్దు ప్రాంతాలైన అబు సమ్రా క్రాసింగ్, సల్వా క్రాసింగ్ లపై చర్చించారు. రాకపోకలను సులభతరం చేయడానికి భద్రతా సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు.
ఖతార్ వైపు అబు సమ్రా క్రాసింగ్ నిర్వహణ కోసం శాశ్వత కమిటీ ఛైర్మన్ కల్నల్ ఖలీద్ అలీ అల్ మెషల్ అల్ బుయైనైన్ నాయకత్వం వహించగా.. సౌదీ వైపు సల్వా క్రాసింగ్లోని బోర్డర్ గార్డ్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ (నేవీ) మొహమ్మద్ బిన్ సులేమాన్ అల్ బలవి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రెండు క్రాసింగ్ల మధ్య ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడం, అలాగే రెండు వైపులా సమన్వయాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన విధానాలపై ఏకభిప్రాయం కుదిరిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!







