బార్డర్ ఇష్యూస్ పై చర్చించిన ఖతార్, సౌదీ అరేబియా..!!
- July 12, 2025
దోహా: ఖతార్ - సౌదీ అరేబియా మధ్య మూడవ సమన్వయ సమావేశం దోహాలో జరిగింది. సరిహద్దు ప్రాంతాలైన అబు సమ్రా క్రాసింగ్, సల్వా క్రాసింగ్ లపై చర్చించారు. రాకపోకలను సులభతరం చేయడానికి భద్రతా సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు.
ఖతార్ వైపు అబు సమ్రా క్రాసింగ్ నిర్వహణ కోసం శాశ్వత కమిటీ ఛైర్మన్ కల్నల్ ఖలీద్ అలీ అల్ మెషల్ అల్ బుయైనైన్ నాయకత్వం వహించగా.. సౌదీ వైపు సల్వా క్రాసింగ్లోని బోర్డర్ గార్డ్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ (నేవీ) మొహమ్మద్ బిన్ సులేమాన్ అల్ బలవి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రెండు క్రాసింగ్ల మధ్య ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడం, అలాగే రెండు వైపులా సమన్వయాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన విధానాలపై ఏకభిప్రాయం కుదిరిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







