బార్డర్ ఇష్యూస్ పై చర్చించిన ఖతార్, సౌదీ అరేబియా..!!
- July 12, 2025
దోహా: ఖతార్ - సౌదీ అరేబియా మధ్య మూడవ సమన్వయ సమావేశం దోహాలో జరిగింది. సరిహద్దు ప్రాంతాలైన అబు సమ్రా క్రాసింగ్, సల్వా క్రాసింగ్ లపై చర్చించారు. రాకపోకలను సులభతరం చేయడానికి భద్రతా సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు.
ఖతార్ వైపు అబు సమ్రా క్రాసింగ్ నిర్వహణ కోసం శాశ్వత కమిటీ ఛైర్మన్ కల్నల్ ఖలీద్ అలీ అల్ మెషల్ అల్ బుయైనైన్ నాయకత్వం వహించగా.. సౌదీ వైపు సల్వా క్రాసింగ్లోని బోర్డర్ గార్డ్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ (నేవీ) మొహమ్మద్ బిన్ సులేమాన్ అల్ బలవి నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో రెండు క్రాసింగ్ల మధ్య ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడం, అలాగే రెండు వైపులా సమన్వయాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన విధానాలపై ఏకభిప్రాయం కుదిరిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్









