తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం..
- July 14, 2025
న్యూ ఢిల్లీ: ఎల్లుండి మధ్యాహ్నం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని జలశక్తి శాఖ ఫిక్స్ చేసింది. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై వీరిద్దరూ చర్చించనున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గత ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఎల్లుండి ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇటు గోదావరి, కృష్ణా జలాల వివాదాలపై చంద్రబాబుతో చర్చించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









