నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- July 20, 2025
విశాఖపట్నం: విశాఖ జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూలై 21న జాబ్ మేళా జరుగనుంది.ఈమేరకు కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి కె. శాంతి అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే పలు జాబ్ మేళాల ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, జులై 21న జరుగనున్న జాబ్ మేళా కోసం వివిధ కంపెనీలతో మాట్లాడి మంచి అవకాశాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇక ఈ జాబ్ మేళాలో 10 కి పైగా ప్రైవేట్ బ్యాంక్, మెడికల్ సంస్థలు పాల్గొంటాయని, 1000 పోస్టుల వరకు భర్తీ చేయనున్నారని తెలిపారు.
విద్యార్హతలు:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ , ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇలా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఉద్యోగం చేయు స్థలం:
ఎంపిక అయిన అభ్యర్థులు విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి , హైదరాబాద్, పరవాడ, అచ్చుతాపురం, విజయనగరంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి గల యువతి,యువకులు అధికారక వెబ్ సైట్ http://naipunyam.ap.gov.in లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సోమవారం జులై 21 ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా మొదలుకానుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









