నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- July 20, 2025
విశాఖపట్నం: విశాఖ జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూలై 21న జాబ్ మేళా జరుగనుంది.ఈమేరకు కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి అధికారి కె. శాంతి అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే పలు జాబ్ మేళాల ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, జులై 21న జరుగనున్న జాబ్ మేళా కోసం వివిధ కంపెనీలతో మాట్లాడి మంచి అవకాశాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇక ఈ జాబ్ మేళాలో 10 కి పైగా ప్రైవేట్ బ్యాంక్, మెడికల్ సంస్థలు పాల్గొంటాయని, 1000 పోస్టుల వరకు భర్తీ చేయనున్నారని తెలిపారు.
విద్యార్హతలు:
ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బి.టెక్ , ఎలక్ట్రికల్ ఎనర్జీ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇలా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఉద్యోగం చేయు స్థలం:
ఎంపిక అయిన అభ్యర్థులు విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనకాపల్లి , హైదరాబాద్, పరవాడ, అచ్చుతాపురం, విజయనగరంలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
ఆసక్తి గల యువతి,యువకులు అధికారక వెబ్ సైట్ http://naipunyam.ap.gov.in లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సోమవారం జులై 21 ఉదయం 10 గంటలకు ఈ జాబ్ మేళా మొదలుకానుంది.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్