రాహుల్ సిప్లిగంజ్కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా
- July 20, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రజల గర్వంగా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆయనకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించారు.
పాతబస్తీ నుంచి తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "నాటు నాటు" పాట ద్వారా ఆస్కార్ వరకూ తన ప్రతిభను చాటారు. తన కష్టమే తన విజయానికి కారణమని నిరూపించిన రాహుల్, తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, రాహుల్కి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ, బోనాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఇటీవల జరిగిన గద్దర్ అవార్డు కార్యక్రమంలో కూడా సీఎం రాహుల్ సిప్లిగంజ్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వం నుండి బహుమతి ప్రకటన ఉంటుందని సూచించారు. ఆ ప్రకటనకు అర్థం ఇవాళ పాతబస్తీ బోనాల వేడుకల్లో స్పష్టమైంది.
తాజా వార్తలు
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు









