రాహుల్ సిప్లిగంజ్కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా
- July 20, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రజల గర్వంగా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆయనకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించారు.
పాతబస్తీ నుంచి తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "నాటు నాటు" పాట ద్వారా ఆస్కార్ వరకూ తన ప్రతిభను చాటారు. తన కష్టమే తన విజయానికి కారణమని నిరూపించిన రాహుల్, తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, రాహుల్కి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ, బోనాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఇటీవల జరిగిన గద్దర్ అవార్డు కార్యక్రమంలో కూడా సీఎం రాహుల్ సిప్లిగంజ్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వం నుండి బహుమతి ప్రకటన ఉంటుందని సూచించారు. ఆ ప్రకటనకు అర్థం ఇవాళ పాతబస్తీ బోనాల వేడుకల్లో స్పష్టమైంది.
తాజా వార్తలు
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!







