రాహుల్ సిప్లిగంజ్కు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా
- July 20, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రజల గర్వంగా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆయనకు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించారు.
పాతబస్తీ నుంచి తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించిన రాహుల్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "నాటు నాటు" పాట ద్వారా ఆస్కార్ వరకూ తన ప్రతిభను చాటారు. తన కష్టమే తన విజయానికి కారణమని నిరూపించిన రాహుల్, తెలంగాణ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, రాహుల్కి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.తాజాగా ఆ మాటను నిలబెట్టుకుంటూ, బోనాల సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
ఇటీవల జరిగిన గద్దర్ అవార్డు కార్యక్రమంలో కూడా సీఎం రాహుల్ సిప్లిగంజ్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వం నుండి బహుమతి ప్రకటన ఉంటుందని సూచించారు. ఆ ప్రకటనకు అర్థం ఇవాళ పాతబస్తీ బోనాల వేడుకల్లో స్పష్టమైంది.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







