ఢిల్లీ చేరుకున్నా చంద్రబాబు నాయుడు..

- July 15, 2016 , by Maagulf
ఢిల్లీ చేరుకున్నా చంద్రబాబు నాయుడు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో అంతరాష్ట్ర మండలి సమావేశంలో బాబు పాల్గొననున్నారు. రాష్ట్రపతిభవన్‌లోని వెస్ట్‌హాల్‌లో ఈ సమావేశం జరుగనుంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేవలం నాలుగు అంశాలనే అజెండాలో చేర్చారు. ఫూంచి కమిషన్ సిఫార్సుల ఆమోదం, ఆధార్‌కార్డుపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తీసుకోనుంది. దీంతో పాటు నగదు బదిలీ పథకం, విద్యా ప్రమాణాలు పెంచడం అంతర్గత భద్రత అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగనుంది. 31మంది కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com