నిమిష ప్రియకు ఉరిశిక్షను రద్దుచేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం..
- July 29, 2025
యెమెన్: భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. అనేక ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు ఆమె ఉరిశిక్ష రద్దయింది. ఓ హత్య కేసులో ఆమెకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారు. సోమవారం అర్థరాత్రి ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియూర్ కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది.
ఆమె మరణశిక్ష రద్దు చేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేస్తూ యెమెన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిషకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జూలై 16నే ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే, భారత ప్రభుత్వ విజ్ఞప్తితో శిక్ష తాత్కాలిక వాయిదా పడింది. నిమిష, బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వాన్ని భారత విదేశాంగశాఖ పలుమార్లు కోరడంతో మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు.
నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చలకోసం నియమించారు. మరోవైపు అబుబాకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అధికారులు అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. అబుబాకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంశాన్ అల్ విశ్వాబి ధ్రువీకరించారు.
నిమిష ప్రియ ప్రస్తుతం యెమెన్ జైలులో ఉంది. ఉరిశిక్ష రద్దయినప్పటికీ ఆమె జైలు నుంచి బయటకు వచ్చే విషయంపై స్పష్టమైన ప్రకటన రాలేదు. నిమిష ప్రియ జైలు నుంచి విడుదల అవుతుందా.. లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. మృతుడు (యెమెన్ పౌరుడు) తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రతికూలతల పై స్ఫూర్తిదాయక విజయానికి అంబేద్కర్ జీవితం నిదర్శనం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- సింగర్ మంగ్లీ కేసు: లాయర్ సుబ్బారావు పై సీపీ సజ్జనార్కు విన్నపం
- అమెరికా నౌకాదళ దిగ్బంధం: ఇరాన్ చుట్టూ 15 యుద్ధనౌకల మోహరింపు
- బీబీఎన్ ఆధ్వర్యంలో హైల్లో ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ ఘన విజయం
- మే 1 వరకు రిమోట్ లెర్నింగ్..యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ క్లారిటీ..!!
- BHD7 బిలియన్లతో రుణ వాయిదా పథకాన్ని ప్రారంభించిన బహ్రెయిన్..!!
- కువైట్ వాయు రక్షణకు యూకే మద్దతు..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాల పై కొత్త ఎక్సైజ్ పన్ను విధానం..!!
- మదీనాలో పోర్టబుల్ గ్యాస్ స్టవ్లు, సిలిండర్ల పై నిషేధం..!!
- దేశీయ విమానయాన నెట్వర్క్ అభివృద్ధికి ఒమన్ ప్రణాళిక..!!









