బహ్రెయిన్ లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!
- July 29, 2025
మానామాః రొయ్యలు, చేపల వేటపై కాలానుగుణ నిషేధాన్ని ఆగస్టు 1 నుండి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ప్రకటించింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ నిషేధం విధించారు.
సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, ఫిషింగ్ కార్యకలాపాలను నియంత్రించడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కౌన్సిల్ తెలిపింది. ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.
నిషేధ కాలంలో స్థానిక మత్స్యకారులు అందించిన సహకారాన్ని అధికారులు ప్రశంసించారు. పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి, బహ్రెయిన్ సముద్ర పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







