బహ్రెయిన్ లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!
- July 29, 2025
మానామాః రొయ్యలు, చేపల వేటపై కాలానుగుణ నిషేధాన్ని ఆగస్టు 1 నుండి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ప్రకటించింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ నిషేధం విధించారు.
సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, ఫిషింగ్ కార్యకలాపాలను నియంత్రించడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కౌన్సిల్ తెలిపింది. ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.
నిషేధ కాలంలో స్థానిక మత్స్యకారులు అందించిన సహకారాన్ని అధికారులు ప్రశంసించారు. పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి, బహ్రెయిన్ సముద్ర పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి









