WCL టోర్నీ నుంచి భారత్ వాకౌట్..
- July 31, 2025
లండన్: ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ జరుగుతోంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీస్కు చేరుకుంది. గురువారం సెమీస్లో దాయాది పాకిస్థాన్తో తలపడాల్సి ఉంది.
అయితే.. పాక్తో ఎట్టి పరిస్థితుల్లో ఆడబోమని భారత ఆటగాళ్లు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్తో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలకు వ్యతిరేకంగా భారత జట్టు తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది.
గ్రూపు దశలోనూ పాక్తో ఆడేందుకు జట్టులోకి కీలక ఆటగాళ్లైన శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీ నిర్వాహకులు గ్రూపు దశలో మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ను కేటాయించారు.
ఇక ఇప్పుడు సెమీస్లో పాక్తో ఆడేది లేదని భారత్ స్పష్టం చేసింది. టీమ్ఇండియా సెమీస్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో పాక్ నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. మరో సెమీస్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టుతో శనివారం పాక్ ఫైనల్ ఆడనుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







