ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణపై దృష్టి: మంత్రి కొండపల్లి
- July 31, 2025
అమరావతి: ఎంఎస్ఎంఈ కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని, వాటి లబ్ది చివరి ప్రయోజనదారుల వరకూ చేరాలన్నదే తమ లక్ష్యం అని ఎంఎస్ఎంఈ, సిర్హ్పీ, ఎన్ఆర్ఎ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పథకాల అమలుపై మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉపాధి సాధనాలు రూపొందించాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. ప్రత్యేక రంగాలవారీగా అవసరాలను గమనించి నైపుణ్యాలను అందించాలని, సాధారణ పద్ధతులు ఫలితాలు ఇవ్వలేవని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివ శంకరరావు, సీఈఓ విశ్వ మనోహరన్ తో పాటు పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈడీసీ అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఈసిడిపి పథకం కింద ఏర్పాటు చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ల (సీఎఫ్సీలు) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అమలులో ఎదురయ్యే అడ్డంకులను తక్షణమే అధిగమించాలని సూచించారు.
రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ (రాంప్) పథకం అమలులో భాగంగా, జిల్లా కలెక్టర్లు నేరుగా రంగంలోకి దిగాలని మంత్రి పిలుపునిచ్చారు. పథకాలు ఉన్నా, అవి వ్యాపారవేత్తలకు తెలిసినప్పుడే ఉపయోగ పడతాయన్నారు.పిఎం విశ్వకర్మ పథకంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఉపాధి సృష్టి కార్యక్రమం (PMEGP) అమలు స్థితిగతులను కూడా మంత్రి సమీక్షించారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సమాచారం సులభంగా అందించే ఉద్దేశంతో ఏఐ ఆధారిత చాట్బాటు రూపొందించాలని మంత్రి ప్రతిపాదించారు.ప్రాథమిక సమాచారం కోసం ఎంటర్ప్రైన్స్యూర్లు వేచి చూడాల్సిన అవసరం ఉండకూడదన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







