ప్రధాని మోదీని కలిసిన చిన్నజీయర్ స్వామి
- July 31, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఆయనను ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు కలిశారు.
తెలంగాణ, ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిథిగా రావాలని మోదీని ఆహ్వానించారు. మోదీ సానుకూలంగా స్పందించారు.
మోదీకి చినజీయర్ స్వామి హైదరాబాద్ ముచ్చింతల్లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలను వివరించారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలలో కొలువుతీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను ప్రధానికి తెలియజేశారు.45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద- హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు.
ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు.
తాజా వార్తలు
- రక్తదానం.. ప్రాణదానం..FOI ఈవెంట్స్ మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
- దుబాయ్ సాలిక్ ఫైన్లు..ఏ తప్పుకు ఎంత జరిమానా? తప్పించుకోవడం ఎలా?
- మేడారంలో తులాభారం..సీఎం రేవంత్ బరువు ఎంతంటే?
- అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం.. నివాసితుడికి షార్జా పోలీసుల సత్కారం
- బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు కీలక సూచనలు.. నిషేధిత, పరిమిత వస్తువుల పూర్తి జాబితా
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!







