న్యూ అడ్వర్టైజ్ పర్మిట్..సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సై..!!

- July 31, 2025 , by Maagulf
న్యూ అడ్వర్టైజ్ పర్మిట్..సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సై..!!

యూఏఈ: యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించిన కొత్త 'అడ్వర్టైజర్ పర్మిట్' కోసం యూఏఈకి చెందిన అనేక కంటెంట్ క్రియేటర్స్ దరఖాస్తు చేసుకుంటున్నారు.ఇది సోషల్ మీడియాలో ప్రమోషనల్ కంటెంట్‌ను షేర్ చేసే ఏ వ్యక్తికైనా, అది చెల్లించినా లేదా చెల్లించకపోయినా త్వరలో తప్పనిసరి కానుంది.ఆన్‌లైన్ ప్రకటనలను నియంత్రించడానికి, పారదర్శకతను పెంచడానికి, కంటెంట్ క్రియేటింగ్ ను చట్టబద్ధమైన వ్యాపార రంగంగా పరిగణించే ప్రయత్నాలలో ఈ చర్య భాగమని ప్రకటించారు.మూడు నెలల్లో అమల్లోకి వచ్చే ఇది మొదటి మూడు సంవత్సరాలు ఉచితంగా అందజేయనున్నారు.దరఖాస్తుదారులు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సందర్శకులు లైసెన్స్ పొందిన ఏజెన్సీల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దుబాయ్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ షాజా ఫరా మాట్లాడుతూ..కొత్త అనుమతి కంటెంట్ సృష్టిని అధికారిక వ్యాపార రంగంగా గుర్తిస్తుందనే బలమైన సందేశాన్ని పంపుతుందని అన్నారు.అలాగే, బూష్ బాషా అని పిలువబడే హాస్యనటుడు, డిజిటల్ క్రియేటర్ మొహమ్మద్ మహమూద్ కూడా తాను అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమన్నారు. “ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. ఇది ప్రకటనలను నియంత్రిస్తుంది. ఎవరికీ కాదు, అనుమతి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుంది. అది అలా ఉండాలి.” అని పేర్కొన్నారు.ఈ అనుమతి నిబద్ధత కలిగిన క్రియేటర్లను క్యాజువల్ వినియోగదారుల నుండి వేరు చేస్తుందని, ఇండస్ట్రీలో విశ్వసనీయతను పెంచుతుందని నమ్ముతున్నారు.“ఇది మేము చేసే పనికి చట్టబద్ధతను జోడిస్తుంది. క్లయింట్‌లకు మరింత విశ్వాసాన్ని ఇస్తుంది.ఒక ప్రక్రియ, నియంత్రణ ఉన్నప్పుడు, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించడం సులభం అవుతుంది." అని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com