తిరుమలలో సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణ పై టీటీడీ హెచ్చరిక
- July 31, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది.తిరుమల లాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితం.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత.
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించడమైనది.తిరుమల పవిత్రతను భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది.
తిరుమలలో అసభ్యకర వీడియోలు,వెకిలి చేష్టలతో రీల్స్ చేయకుండా తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం, పవిత్రతను కాపాడడంలో సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- రక్తదానం.. ప్రాణదానం..FOI ఈవెంట్స్ మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
- దుబాయ్ సాలిక్ ఫైన్లు..ఏ తప్పుకు ఎంత జరిమానా? తప్పించుకోవడం ఎలా?
- మేడారంలో తులాభారం..సీఎం రేవంత్ బరువు ఎంతంటే?
- అనుమానాస్పద కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం.. నివాసితుడికి షార్జా పోలీసుల సత్కారం
- బంగాళాఖాతంలో అల్పపీడనం..పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు కీలక సూచనలు.. నిషేధిత, పరిమిత వస్తువుల పూర్తి జాబితా
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!







