నేటి నుంచి ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ వార్షిక సదస్సు
- July 31, 2025
విజయవాడ: మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య చికిత్సల గురించి చర్చించేందుకు నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదిక కానుంది.ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న తెలిపారు.సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు.సూర్యారావుపేటలో గురువారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ అమ్మన్న మాట్లాడుతూ..శుక్రవారం సాయంత్రం జరిగే ప్రారంభోత్సవ వేడుకలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరి రావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. అత్యాధునిక నెఫ్రాలజీ చికిత్సలు, ఆధునిక ఔషధాలు, నవీన ఆవిష్కరణ గురించి చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి విజ్ఞాన సర్వస్వంగా ఈ సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. వివిధ అంశాలపై నిపుణుల ప్రసంగాలు, ఆధునిక చికిత్సా విధానాలపై విశ్లేషణలు, చికిత్సల్లో ఎదురయ్యే సంక్లిష్టతలపై సదస్సులో చర్చా కార్యక్రమాలు జరుగుతాయని డాక్టర్ అమ్మన్న వివరించారు.దక్షిణ భారతదేశంలోని నెఫ్రాలజిస్టులకు,యువ వైద్య నిపుణులకు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







