మీ మాజీ గురించి ఆన్లైన్లో మాట్లాడుతున్నారా? Dh500,000 జరిమానా..!!
- August 05, 2025
యూఏఈ: విడాకుల గురించి వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారా? అలాంటి పోస్ట్లు పరువు నష్టం కిందకు వస్తాయని దీనికి సంబంధించి భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ చట్టంలో భాగస్వామి, అంతర్జాతీయ కుటుంబ చట్ట నిపుణుడు బైరాన్ జేమ్స్ మాట్లాడుతూ.. యూఏఈలోని చట్టం ప్రకారం, పరువు నష్టం, గోప్యతా ఉల్లంఘనలు రెండూ క్రిమినల్ నేరాలు అని తెలిపారు. వీటికి భారీ జరిమానాలు ఉంటాయన్నారు. “సోషల్ మీడియా, వాట్సాప్, ఇమెయిల్ లేదా బ్లాగులు కూడా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ మార్గాల పరిధిలోకి వస్తాయి. ఏదైనా షేర్ చేసిన తర్వాత, అది సైబర్ నేరంగా మారుతుంది. జరిమానాలు Dh500,000 వరకు, జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో పౌరులు కానివారిని దేశం నుంచి బహిష్కరిస్తారు.” అని హెచ్చరించారు బైరాన్ జేమ్స్.
ఎందుకు పోస్ట్ చేస్తారు?
బాధ లేదా నష్ట సమయంలో భావోద్వేగ నియంత్రణ కోల్పోతారని యూఏఈకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణుడు మనస్తత్వవేత్త రెహాబ్ అల్ హమ్మది అన్నారు. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి, తమ వైపు చెప్పడానికి ప్రయత్నిస్తారని.. కానీ సోషల్ మీడియా సురక్షితమైన మార్గం కాదని సూచించారు. ఇలాంటివి మరింత నష్టం చేస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









