మీ మాజీ గురించి ఆన్లైన్లో మాట్లాడుతున్నారా? Dh500,000 జరిమానా..!!
- August 05, 2025
యూఏఈ: విడాకుల గురించి వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారా? అలాంటి పోస్ట్లు పరువు నష్టం కిందకు వస్తాయని దీనికి సంబంధించి భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ చట్టంలో భాగస్వామి, అంతర్జాతీయ కుటుంబ చట్ట నిపుణుడు బైరాన్ జేమ్స్ మాట్లాడుతూ.. యూఏఈలోని చట్టం ప్రకారం, పరువు నష్టం, గోప్యతా ఉల్లంఘనలు రెండూ క్రిమినల్ నేరాలు అని తెలిపారు. వీటికి భారీ జరిమానాలు ఉంటాయన్నారు. “సోషల్ మీడియా, వాట్సాప్, ఇమెయిల్ లేదా బ్లాగులు కూడా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ మార్గాల పరిధిలోకి వస్తాయి. ఏదైనా షేర్ చేసిన తర్వాత, అది సైబర్ నేరంగా మారుతుంది. జరిమానాలు Dh500,000 వరకు, జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో పౌరులు కానివారిని దేశం నుంచి బహిష్కరిస్తారు.” అని హెచ్చరించారు బైరాన్ జేమ్స్.
ఎందుకు పోస్ట్ చేస్తారు?
బాధ లేదా నష్ట సమయంలో భావోద్వేగ నియంత్రణ కోల్పోతారని యూఏఈకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణుడు మనస్తత్వవేత్త రెహాబ్ అల్ హమ్మది అన్నారు. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి, తమ వైపు చెప్పడానికి ప్రయత్నిస్తారని.. కానీ సోషల్ మీడియా సురక్షితమైన మార్గం కాదని సూచించారు. ఇలాంటివి మరింత నష్టం చేస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







