మీ మాజీ గురించి ఆన్లైన్లో మాట్లాడుతున్నారా? Dh500,000 జరిమానా..!!
- August 05, 2025
యూఏఈ: విడాకుల గురించి వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారా? అలాంటి పోస్ట్లు పరువు నష్టం కిందకు వస్తాయని దీనికి సంబంధించి భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ చట్టంలో భాగస్వామి, అంతర్జాతీయ కుటుంబ చట్ట నిపుణుడు బైరాన్ జేమ్స్ మాట్లాడుతూ.. యూఏఈలోని చట్టం ప్రకారం, పరువు నష్టం, గోప్యతా ఉల్లంఘనలు రెండూ క్రిమినల్ నేరాలు అని తెలిపారు. వీటికి భారీ జరిమానాలు ఉంటాయన్నారు. “సోషల్ మీడియా, వాట్సాప్, ఇమెయిల్ లేదా బ్లాగులు కూడా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ మార్గాల పరిధిలోకి వస్తాయి. ఏదైనా షేర్ చేసిన తర్వాత, అది సైబర్ నేరంగా మారుతుంది. జరిమానాలు Dh500,000 వరకు, జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో పౌరులు కానివారిని దేశం నుంచి బహిష్కరిస్తారు.” అని హెచ్చరించారు బైరాన్ జేమ్స్.
ఎందుకు పోస్ట్ చేస్తారు?
బాధ లేదా నష్ట సమయంలో భావోద్వేగ నియంత్రణ కోల్పోతారని యూఏఈకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణుడు మనస్తత్వవేత్త రెహాబ్ అల్ హమ్మది అన్నారు. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి, తమ వైపు చెప్పడానికి ప్రయత్నిస్తారని.. కానీ సోషల్ మీడియా సురక్షితమైన మార్గం కాదని సూచించారు. ఇలాంటివి మరింత నష్టం చేస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









