మీ మాజీ గురించి ఆన్లైన్లో మాట్లాడుతున్నారా? Dh500,000 జరిమానా..!!
- August 05, 2025
యూఏఈ: విడాకుల గురించి వ్యక్తిగత వివరాలను పంచుకోవడానికి సోషల్ మీడియా వైపు మొగ్గు చూపుతున్నారా? అలాంటి పోస్ట్లు పరువు నష్టం కిందకు వస్తాయని దీనికి సంబంధించి భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ చట్టంలో భాగస్వామి, అంతర్జాతీయ కుటుంబ చట్ట నిపుణుడు బైరాన్ జేమ్స్ మాట్లాడుతూ.. యూఏఈలోని చట్టం ప్రకారం, పరువు నష్టం, గోప్యతా ఉల్లంఘనలు రెండూ క్రిమినల్ నేరాలు అని తెలిపారు. వీటికి భారీ జరిమానాలు ఉంటాయన్నారు. “సోషల్ మీడియా, వాట్సాప్, ఇమెయిల్ లేదా బ్లాగులు కూడా, ఇవన్నీ ఎలక్ట్రానిక్ మార్గాల పరిధిలోకి వస్తాయి. ఏదైనా షేర్ చేసిన తర్వాత, అది సైబర్ నేరంగా మారుతుంది. జరిమానాలు Dh500,000 వరకు, జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో పౌరులు కానివారిని దేశం నుంచి బహిష్కరిస్తారు.” అని హెచ్చరించారు బైరాన్ జేమ్స్.
ఎందుకు పోస్ట్ చేస్తారు?
బాధ లేదా నష్ట సమయంలో భావోద్వేగ నియంత్రణ కోల్పోతారని యూఏఈకి చెందిన మానసిక ఆరోగ్య నిపుణుడు మనస్తత్వవేత్త రెహాబ్ అల్ హమ్మది అన్నారు. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి, తమ వైపు చెప్పడానికి ప్రయత్నిస్తారని.. కానీ సోషల్ మీడియా సురక్షితమైన మార్గం కాదని సూచించారు. ఇలాంటివి మరింత నష్టం చేస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం
- సెప్టెంబర్ 30న ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు శ్రీకారం
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!







