ఢిల్లీలో గోడకూలి 8 మంది మృతి

- August 09, 2025 , by Maagulf
ఢిల్లీలో గోడకూలి 8 మంది మృతి

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పండగ సంతోషాలను చెరిపేసేలా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రావణ మాసపు పండుగ ఉత్సాహం నడుమ, ఢిల్లీలోని హరినగర్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను విషాదంలో ముంచేసింది. గురువారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో, హరినగర్‌లోని పాత ఆలయానికి ఆనుకుని ఉన్న ఒక భారీ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ గోడ కూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందరు వారు మరణించినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఇక్కడ ఒక పాత ఆలయం ఉంది, దాని పక్కనే స్క్రాప్ డీలర్లు నివసించే పాత జగ్గీలు ఉన్నాయి.రాత్రిపూట కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయి ఈ ప్రమాదం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. స్థానికంగా ఉన్న జగ్గీలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఐశ్వర్య శర్మ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com