అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- October 11, 2025
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11వ కతారా ఉత్సవంలో భాగంగా అక్టోబర్ 13 నుండి 19 వరకు కతారా బుక్ ఫెయిర్ మూడవ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం ఎడిషన్లో ఖతార్ మరియు అరబ్ దేశాల నుండి 90 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, ట్యునీషియా మరియు సిరియాకు చెందిన రచయితలకు చెందిన పుస్తకాలు ఇక్కడ కొలువుదీరనున్నాయి.
ఈ సంవత్సరం ఈవెంట్లో అనేక రకాల పుస్తక ఆవిష్కరణ వేడుకలు, ప్రముఖ రచయితకు చెందని పుస్తకాల ఆవిష్కరణలు ఉంటాయని కటారా పబ్లిషింగ్ హౌస్ డైరెక్టర్ అమీరా అహ్మద్ అల్ మొహన్నాది తెలిపారు. ఫెయిర్ సందర్భంగా ఆరు విభాగాల్లో ఉత్తమ పుస్తకాలను గుర్తించి, వాటి రచయితలకు బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









