క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి
- August 15, 2025
హైదరాబాద్: హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 15 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 70కిపైగా ప్రతిష్టాత్మక డెవలపర్లు రూపొందించిన రేరా ఆమోదం పొందిన నివాస, వాణిజ్య ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అన్వితా డైరెక్టర్లు బొప్పన నాగభూషణం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం