బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- October 09, 2025
మనామా: బహ్రెయిన్లోని వలస కార్మికుల రక్షణ సంఘం (MWPS) డైరెక్టర్ల బోర్డు చైర్పర్సన్గా మోనా యూసుఫ్ ఖలీల్ అల్మోయ్యద్ ఎన్నికయ్యారు. న్యాయవాది మాధవన్ కల్లాత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్ల జాబితా ప్రకారం.. చైర్పర్సన్ గా మోనా యూసుఫ్ ఖలీల్ అల్మోయ్యద్; వైస్ చైర్పర్సన్ గా ఎవోన్ విజయవాణి భాస్కరన్; ప్రధాన కార్యదర్శి గా మాధవన్ కల్లాత్; కోశాధికారిగా కవితశ్రీ సువర్ణ; అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ గా మొహమ్మద్ గయాసుల్లా అమానుల్లా మరియు అసిస్టెంట్ కోశాధికారి గా డేనియల్ మెనెజెస్ అంబ్రోసియో ఎన్నికయ్యారు.
సంస్థల లక్ష్యాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు బోర్డు ఐదు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయుక్ అర్రే నదుమ్నే ఆధ్వర్యంలో యాక్షన్ కమిటీ, కవితశ్రీ సువర్ణ హెడ్ గా ఫైనాన్స్ కమిటీ, మహమ్మద్ గయాస్ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కమిటీ, జుహైర్ కతీబ్ నేతృత్వంలో లేబర్ సేఫ్టీ & వెల్ఫేర్ కమిటీ మరియు రాజి ఉన్నికృష్ణన్ ఆధ్వర్యంలో మీడియా & పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









