కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- October 09, 2025
మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్ తీసుకుని పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మరణించిన చిన్నారుల సంఖ్య 20కి చేరింది. దీనికి కారణమైన ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్ ను తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. మధ్యప్రదేశ్ పోలీసులు శ్రీసన్ ఫార్మా కంపెనీ ఓనర్ని గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్లు మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నారు.
న్నారులకు ఈ కలుషితమైన సిరప్ను సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని ఇప్పటికే అరెస్టు చేశారు. దీంతో పాటు, సిరప్ తయారీకి బాధ్యులైన తమిళనాడులోని కాంచీపురం కేంద్రంగా పనిచేస్తున్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ డైరెక్టర్లు, ఇతర బాధ్యులపై కేసు నమోదు చేశారు. కోల్డ్రిఫ్ సిరప్లో అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టరేట్, అలాగే మధ్యప్రదేశ్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో ‘కోల్డ్రిఫ్’ సిరప్లో 46% నుంచి 48% వరకు డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారించారు. యాంటీ-ఫ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్లలో ఉపయోగించే ఈ విషపూరిత రసాయనం, సేవించిన చిన్నారుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడానికి కారణమైంది. ఈ విషాదంలో మరణించిన చిన్నారుల సంఖ్య 14కు పైగా పెరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ‘కోల్డ్రిఫ్’ సిరప్ అమ్మకాలను తక్షణమే నిలిపివేసి, స్టాకును సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ల నాణ్యత, సరైన వినియోగంపై కఠినమైన చర్యలకు ఉపక్రమించింది.
దగ్గును తగ్గించుకోవడానికి, గోరువెచ్చని నీరు, తేనె, అల్లం, పసుపు, మిరియాలు వంటివి ఉపయోగించవచ్చు; ఆవిరి పీల్చడం, ధూమపానం వంటి చికాకులను నివారించడం, పుష్కలంగా ద్రవాలు తాగడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి.
రాత్రి దగ్గు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో శ్లేష్మం పేరుకుపోవడం, అలర్జీలు, యాసిడ్ రిఫ్లక్స్, మరియు పడకగదిలోని గాలి నాణ్యత అని తెలియజేస్తున్నాయి. పడుకున్నప్పుడు శ్వాసనాళాల్లో శ్లేష్మం చేరి దగ్గును ప్రేరేపిస్తుంది, అలాగే దుమ్ము, పుప్పొడి వంటివి దగ్గును తీవ్రతరం చేస్తాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









