సీపీ రాధాకృష్ణన్ ను కలిసిన ప్రధాని మోదీ
- August 18, 2025
న్యూ ఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్, సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.సీపీ రాధాకృష్ణన్ గారిని కలిశాను. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన అనుభవం దేశానికి ఉపయోగపడుతుంది. అదే అంకితభావంతో కొనసాగుతారని నమ్మకముంది, అని మోదీ పేర్కొన్నారు.రాధాకృష్ణన్ కూడా ఈ భేటీపై స్పందిస్తూ, ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఎంపికను స్వాగతించారు.ఇది మంచి నిర్ణయం. జేడీయూ పూర్తి మద్దతు ఇస్తుంది, అంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.జేడీయూకు లోక్సభలో 12, రాజ్యసభలో 4 స్థానాలు ఉన్నాయి. ఈ మద్దతు ఎన్డీఏకు కీలకంగా మారుతుంది.రాజకీయ సమీకరణాలపై బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. ఇతర పార్టీల మద్దతు కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ బాధ్యతను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేపట్టారు.తమిళనాడు సీఎం స్టాలిన్, వైఎస్ జగన్లతో రాజ్నాథ్ ఫోన్లో మాట్లాడారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్కు రాష్ట్ర పార్టీ మద్దతు దొరకడం గెలుపు అవకాశాలను పెంచుతుంది.
ఇందాకా ఎన్డీఏ అభ్యర్థి పై దృష్టి కేంద్రీకృతమైంది కానీ, నేడు ఇండియా కూటమి నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించనున్నారు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. సోమవారం అభ్యర్థిని ప్రకటిస్తాం, అని ఆయన తెలిపారు.67 ఏళ్ల సీపీ రాధాకృష్ణన్ రాజకీయంగా అనుభవజ్ఞుడు. కోయంబత్తూరు నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఆర్ఎస్ఎస్తో బలమైన అనుబంధం ఉంది. ఓబీసీ వర్గానికి చెందిన ఆయన, పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని గెలుచుకున్నారు.ఇప్పటికే బలంగా ఉన్న ఎన్డీఏ, మిత్రపక్షాల మద్దతుతో మరింత మెరుగైన స్థితిలోకి వస్తోంది. అయితే ఇండియా కూటమి అభ్యర్థి ఎవరు? ఎంత మేర మద్దతు సంపాదించగలరు? అన్నది వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







