ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!

- July 10, 2026 , by Maagulf
ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!

మస్కట్: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధికారిక పర్యటనలో భాగంగా ఒమన్ రాజధాని మస్కట్ చేరుకున్నారు. మస్కట్ విమానాశ్రయంలో ఒమాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన జీసీసీ విభాగాధిపతి షేక్ అహ్మద్ హషెల్ అల్ మస్కరీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తనకు అందించిన ఆత్మీయ స్వాగతానికి షేక్ అహ్మద్ అల్ మస్కరీకి మంత్రి ఎస్. జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పర్యటనలో భారత్–ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, ప్రాంతీయ పరిణామాలు తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com