ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- July 10, 2026
మనామా: బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ పలుమార్లు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడాన్ని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ఐక్యరాజ్యసమితి చార్టర్తో పాటు భద్రతా మండలి తీర్మానాలను కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదకర పరిణామంగా ఈ చర్యలను అభివర్ణించింది.
దాడులను విజయవంతంగా అడ్డుకున్న మిత్రదేశాల సాయుధ దళాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను బహ్రెయిన్ అభినందించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం ప్రతి దేశానికి ఆత్మరక్షణ హక్కు ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ చర్యలకు బాధ్యత వహించేలా అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ చర్యలు తీసుకోవాలని బహ్రెయిన్ కోరింది. అలాగే హోర్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాకు స్వేచ్ఛను కల్పించడంతో పాటు అన్ని శత్రుత్వ చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







