రెస్టారెంట్ యజమానికి 3 ఏళ్ల జైలుశిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 21, 2025
మనామా: బహ్రెయిన్ లో 50 ఏళ్ల రెస్టారెంట్ యజమానికి మూడవ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన కేసులో ఈ శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
కాగా, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాథమిక తీర్పును అప్పీల్ చేసింది. నిందితుడి నిర్లక్ష్యం ఈ విషాదానికి దారితీసిందని వాదించింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల రెస్టారెంట్ నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల మొత్తం భవనం కూలిపోయిన పేలుడు సంభవించిందని దర్యాప్తులో కూడా తేలిందని పేర్కొంది.
రెస్టారెండ్ యజమాని భద్రతా పరమైన అనుమతులు పొందకుండా రెస్టారెంట్ను నిర్వహిస్తున్నాడని, ఆమోదం లేని గ్యాస్ డిటెక్షన్ వ్యవస్థలను ఉపయోగించాడని అధికారులు నిర్ధారించారు. భద్రత మరియు చట్టపరమైన అవసరాలను పాటించడంలో విఫలమైనందుకు కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









