రెస్టారెంట్ యజమానికి 3 ఏళ్ల జైలుశిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 21, 2025
మనామా: బహ్రెయిన్ లో 50 ఏళ్ల రెస్టారెంట్ యజమానికి మూడవ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన కేసులో ఈ శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
కాగా, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాథమిక తీర్పును అప్పీల్ చేసింది. నిందితుడి నిర్లక్ష్యం ఈ విషాదానికి దారితీసిందని వాదించింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల రెస్టారెంట్ నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల మొత్తం భవనం కూలిపోయిన పేలుడు సంభవించిందని దర్యాప్తులో కూడా తేలిందని పేర్కొంది.
రెస్టారెండ్ యజమాని భద్రతా పరమైన అనుమతులు పొందకుండా రెస్టారెంట్ను నిర్వహిస్తున్నాడని, ఆమోదం లేని గ్యాస్ డిటెక్షన్ వ్యవస్థలను ఉపయోగించాడని అధికారులు నిర్ధారించారు. భద్రత మరియు చట్టపరమైన అవసరాలను పాటించడంలో విఫలమైనందుకు కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







