హైదరాబాద్కు ఎల్లో అలర్ట్
- August 21, 2025
హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.గురువారం హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసి, 6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్లు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.నిన్న సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హెచ్సీయూ వద్ద అత్యధికంగా 1.23 సెంటిమీటర్ల వర్షం పడింది.మరోవైపు, తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాలో వర్షాలు కురుస్తాయన్నారు.
అలాగే, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
మరోవైపు, కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నిన్న భారీ వర్షాల నుంచి ముంబై ఉపశమనం పొందింది.
ముంబైలో ఎక్కువ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరిచి సాధారణ షెడ్యూల్ ప్రకారం ఇవాళ నడుస్తున్నాయి. లోకల్ రైళ్లు తిరిగి పునరుద్ధరించడంతో సాధారణ సేవలు అందుతున్నాయి.
కార్యాలయాలు బుధవారం తెరుచుకోగా, బ్యాంకులు, దుకాణాలు కూడా సాధారణంగా నడుస్తున్నాయి. అయితే, లోనావాలా మున్సిపల్ కౌన్సిల్ భారీ వర్షాల కారణంగా ఈ రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







