దుబాయ్ లో 6 సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్..!!
- August 22, 2025
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇకపై 6 సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చు. కొత్త AI-ఆధారిత స్మార్ట్ కారిడార్లో సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్ అవుతుందని అధికారులు తెలిపారు. పీక్ ట్రావెల్ సీజన్లో టెర్మినల్ 3లో కౌంటర్లు, డాక్యుమెంట్ తనిఖీలు లేదా పాస్పోర్ట్ స్కాన్లు లేకుండా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేయవచ్చు.
ఏఐ ఆధారిత సెన్సార్లు ప్రయాణీకులు వెళ్లే సమయంలోనే వారి ఫేస్ లను స్కాన్ చేయడంతో ఇది సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. కారిడార్ చివరిలో ప్రయాణీకుడి ఫోటో, విమాన వివరాలు మరియు టైమ్స్టాంప్తో పాటు "ఇమ్మిగ్రేషన్ విధానం పూర్తయింది" అనే సందేశాన్ని స్క్రీన్ ఫ్లాష్ చేసింది. ఈ ప్రక్రియ మొత్త పూర్తయేందుకు 6 సెకన్ల టైమ్ మాత్రమే పడుతుందన్నారు.
ప్రస్తుతం ఈ కారిడార్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని, రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్టులోని అన్ని కారిడార్లకు ఈ ఏఐ టెక్నాలజీని విస్తారించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవస్థ ఒకేసారి 10 మంది ప్రయాణికులను ప్రాసెస్ చేయగలదని, సీనియర్ సిటిజన్లు మరియు వీల్చైర్లను ఉపయోగించే వ్యక్తులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు.
ఈ కారిడార్ ఇమ్మిగ్రేషన్ను వేగవంతం చేయడమే కాకుండా భద్రతను కూడా పెంచుతుందని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









