వాణిజ్యం , పెట్టుబడులపై ఒమన్, లెబనాన్ చర్చలు..!!
- August 22, 2025
మస్కట్: వాణిజ్యం , పెట్టుబడుల సహకారంపై ఒమన్, లెబనాన్ చర్చలు జరిపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఒమన్ వాణిజ్య, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసఫ్.. లెబనాన్ ఆర్థిక మరియు వాణిజ్య మంత్రి డాక్టర్ అమెర్ బిసాట్తో సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర రంగాల్లో భాగస్వామ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. పెట్టుబడులను పెంచడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం , లాజిస్టిక్స్ వంటి అనేక కీలక రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు మంత్రులు సమీక్షించారు.
వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచేందుకు వీలుగా మస్కట్ - బీరుట్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో లెబనాన్లో ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ సైదితో పాటు రెండు దేశాల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







