వాణిజ్యం , పెట్టుబడులపై ఒమన్, లెబనాన్ చర్చలు..!!
- August 22, 2025
మస్కట్: వాణిజ్యం , పెట్టుబడుల సహకారంపై ఒమన్, లెబనాన్ చర్చలు జరిపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఒమన్ వాణిజ్య, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసఫ్.. లెబనాన్ ఆర్థిక మరియు వాణిజ్య మంత్రి డాక్టర్ అమెర్ బిసాట్తో సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర రంగాల్లో భాగస్వామ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. పెట్టుబడులను పెంచడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం , లాజిస్టిక్స్ వంటి అనేక కీలక రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు మంత్రులు సమీక్షించారు.
వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచేందుకు వీలుగా మస్కట్ - బీరుట్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో లెబనాన్లో ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ సైదితో పాటు రెండు దేశాల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









