వాణిజ్యం , పెట్టుబడులపై ఒమన్, లెబనాన్ చర్చలు..!!
- August 22, 2025
మస్కట్: వాణిజ్యం , పెట్టుబడుల సహకారంపై ఒమన్, లెబనాన్ చర్చలు జరిపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఒమన్ వాణిజ్య, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసఫ్.. లెబనాన్ ఆర్థిక మరియు వాణిజ్య మంత్రి డాక్టర్ అమెర్ బిసాట్తో సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర రంగాల్లో భాగస్వామ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. పెట్టుబడులను పెంచడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం , లాజిస్టిక్స్ వంటి అనేక కీలక రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు మంత్రులు సమీక్షించారు.
వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచేందుకు వీలుగా మస్కట్ - బీరుట్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో లెబనాన్లో ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ సైదితో పాటు రెండు దేశాల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







