వాణిజ్యం , పెట్టుబడులపై ఒమన్, లెబనాన్ చర్చలు..!!
- August 22, 2025
మస్కట్: వాణిజ్యం , పెట్టుబడుల సహకారంపై ఒమన్, లెబనాన్ చర్చలు జరిపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఒమన్ వాణిజ్య, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసఫ్.. లెబనాన్ ఆర్థిక మరియు వాణిజ్య మంత్రి డాక్టర్ అమెర్ బిసాట్తో సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర రంగాల్లో భాగస్వామ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. పెట్టుబడులను పెంచడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం , లాజిస్టిక్స్ వంటి అనేక కీలక రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు మంత్రులు సమీక్షించారు.
వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచేందుకు వీలుగా మస్కట్ - బీరుట్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో లెబనాన్లో ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ సైదితో పాటు రెండు దేశాల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







