ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా.. కొత్త డేట్ ఇదే..
- August 25, 2025
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసింది. తాజాగా, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను మంగళవారానికి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 25 సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కాల్ లెటర్ల పంపిణీలో ఆలస్యం జరగడంతో వెరిఫికేషన్ ప్రక్రియను(AP Mega DSC) ఒక రోజు వాయిదా వేశారు అధికారులు.
ఇక మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు కూడా కేటాయించారు. ఇక రిజర్వేషన్లు, స్థానికత ప్రమాణాల ఆధారంగా ఎంపికైన వారికి కాల్ లెటర్లు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి, ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా పలు దఫాలుగా జాబితాలను పరిశీలిస్తున్నారు అధికారులు. తాజా అప్డేట్ ప్రకారం సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని అధికారుల నుంచి వస్తున్న సమాచారం.
ఇక సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం ఎంపికైన అభ్యర్థులను వచ్చే నెల రెండో వారంలోనే పాఠశాలల్లో జాయిన్ అయ్యేలా షెడ్యూల్ను సిద్ధం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









