ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా.. కొత్త డేట్ ఇదే..
- August 25, 2025
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసింది. తాజాగా, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను మంగళవారానికి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 25 సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కాల్ లెటర్ల పంపిణీలో ఆలస్యం జరగడంతో వెరిఫికేషన్ ప్రక్రియను(AP Mega DSC) ఒక రోజు వాయిదా వేశారు అధికారులు.
ఇక మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు కూడా కేటాయించారు. ఇక రిజర్వేషన్లు, స్థానికత ప్రమాణాల ఆధారంగా ఎంపికైన వారికి కాల్ లెటర్లు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి, ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా పలు దఫాలుగా జాబితాలను పరిశీలిస్తున్నారు అధికారులు. తాజా అప్డేట్ ప్రకారం సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని అధికారుల నుంచి వస్తున్న సమాచారం.
ఇక సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం ఎంపికైన అభ్యర్థులను వచ్చే నెల రెండో వారంలోనే పాఠశాలల్లో జాయిన్ అయ్యేలా షెడ్యూల్ను సిద్ధం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!