అల్ వాజ్బాలో ఇంటిగ్రేటెడ్ రోడ్ నెట్వర్క్ పనులు పూర్తి..!!
- August 27, 2025
దోహా: ఖతార్ లోని అల్ వాజ్బా తూర్పులో రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు ప్యాకేజీ 3 పూర్తయినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ‘అష్ఘల్’ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని రోడ్డు నెట్వర్క్ మరియు మౌలిక సదుపాయాల సేవలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అష్ఘల్ ఇంజినీర్ హమద్ అల్ మెజాబా తెలిపారు. ఈ ప్రాజెక్టు సమీప ప్రాంతాల ప్రజల జీవన నాణ్యతను పెంచుతుందన్నారు.
అల్ వాజ్బా తూర్పును అభివృద్ధి చేయాలనే అధికార ప్రణాళికలో రెండు ప్యాకేజీలు ఉన్నాయని ఇంజనీర్ హమద్ అల్ మెజాబా తెలిపారు. అథారిటీ 2024 ప్రారంభంలో మొదటి ప్యాకేజీని పూర్తి చేసిందన్నారు. మొత్తం 17 కి.మీ.లతో కూడిన ఇంటిగ్రేటెడ్ రోడ్ నెట్వర్క్ ట్రాఫిక్ సమస్యలను తీర్చడంతోపాటు అనేక విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు మరియు మసీదులు, అల్ వాజ్బా హెల్త్ సెంటర్ కు పబ్లిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్లో 854 స్ట్రీట్ లైట్స్, 3,180 పార్కింగ్ స్థలాలతోపాటు 34 కి.మీ.ల వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ పరిధిలో 12 కి.మీ మురుగునీటి నెట్వర్క్లు, 15.7 కి.మీ ఉపరితల, భూగర్భజల మరియు వర్షపు నీటి పారుదల నెట్వర్క్లు, 8.5 కి.మీ శుద్ధి చేసిన మురుగునీటి నెట్వర్క్ అభివృద్ధి ఉన్నాయని ఇంజినీర్ అల్ తమీమి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









