గాజాపై కొనసాగుతున్న దురాక్రమణను ఖండించిన ఒమన్..!!
- August 27, 2025
మస్కట్: ఖాన్ యూనిస్లోని నాజర్ మెడికల్ కాంప్లెక్స్లో వైద్య, సహాయ మరియు మీడియా సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
పాలస్తీనా ప్రజలు వారి చట్టబద్ధమైన హక్కులను పొందడం ద్వారా మాత్రమే పాలస్తీనా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒమన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టబద్ధత మరియు అరబ్ శాంతి తీర్మానాల ఆధారంగా అల్ ఖుద్స్ అ'షర్కియా (తూర్పు జెరూసలేం) రాజధానిగా పాలస్తీనా రాజ్య స్థాపన అన్నింటికి పరిష్కారం చూపుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







