బలవంతపు శ్రమ దోపిడీ, మానసిక వేధింపులు.. ఇద్దరికి జైలుశిక్ష..!!
- August 28, 2025
మనామా: మొదటి హై క్రిమినల్ కోర్టు ఇద్దరు వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 1,000 బహ్రెయిన్ దినార్ల చొప్పున జరిమానా విధించినట్లు మానవ అక్రమ రవాణా ప్రాసిక్యూషన్కు నాయకత్వం వహిస్తున్న చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అలాగే, మహిళా నిందితురాలిని శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించిందన్నారు. ఇద్దరు బాధితులను బలవంతంగా అక్రమ రవాణా చేసినందుకు వారు దోషులుగా తేలిన తర్వాత కోర్టు తీర్పు వెలువరించినదని పేర్కొన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాధితుల నుండి ఫిర్యాదును అందుకున్న తర్వాత దర్యాప్తు చేసిందన్నారు. బాధితులు అంగీకరించిన దానికి భిన్నమైన పనులలో, జీతం లేకుండా, బెదిరింపులతో ఎక్కువ గంటలు పనిచేయమని బలవంతం చేయడం ద్వారా నిందితులు తమను మానసికంగా వేధించి శ్రమ దోపిడీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసి, నిందితులను విచారించారు. ఆరోపణలు నిజం కావడంతో నిందితులను క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!