సౌదీ అరేబియాలో ముగిసిన బర్గర్ చైన్ హాంబర్గి సేవలు..!!
- August 30, 2025
రియాద్: 12 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత, సౌదీ అరేబియా లోని హాంబర్గిని బర్గర్ చైన్ కథ ముగిసింది. దాని మాతృ సంస్థ అయిన అససియత్ అల్-ఘితా ట్రేడింగ్ను రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసి, కంపెనీని దివాలా తీయించిన ఒక పెద్ద ఫుడ్ పాయిజనింగ్ సంఘటన తర్వాత ఈ తీర్పు వెలువడింది.
దివాలా ట్రస్టీ ముబారక్ అల్-అనాజీ గత వారం రియాద్ కమర్షియల్ కోర్టు లిక్విడేషన్ చర్యలను ఆదేశించిందని మరియు తీర్పు వెలువడిన 90 రోజుల్లోపు క్లెయిమ్లను సమర్పించాలని రుణదాతలను కోరినట్లు ప్రకటించారు.
2013లో రియాద్లో స్థాపించబడిన హాంబర్గిని.. డిజిటల్ మార్కెటింగ్ మరియు బలమైన సోషల్ మీడియా ఉనికి ద్వారా యువ వినియోగదారులలో గుర్తింపు పొందింది. 2015 మరియు 2019 మధ్య సౌదీ అరేబియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ప్రముఖ బర్గర్ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు సాధించింది. హాంబర్గిని సౌదీ అరేబియా అంతటా 57 శాఖలను నిర్వహించింది.
రియాద్లో 2024లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలో 70 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. ఒకరు మరణించారు. క్లోస్ట్రిడియం బోటులినమ్తో కలుషితమైన దిగుమతి చేసుకున్న "బాన్ తుమ్" మయోసాస్ బ్రాండ్ ఫుడ్ పాయిజన్ కు కారణమని దర్యాప్తులో తేలింది. దీంతో అధికారులు రియాద్లోని అన్ని హాంబర్గిని బ్రాంచీలను సీజ్ చేశారు. ఉత్పత్తిని నిలిపివేయించడంతో అది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







