గణేశ్ ఉత్సవాలకు మెట్రో రైల్ అదునపు సేవలు
- August 30, 2025
హైదరాబాద్: హైదరాబాద్లో గణపతి నవరాత్రులు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో, మెట్రో రైల్ సంస్థ భక్తుల కోసం శుభవార్త తెలిపింది. నగరంలో ఎక్కువ రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఈరోజు మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకారం, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరనుంది.
ప్రస్తుతం నగరంలోని అనేక ప్రాంతాల్లో గణేశ్ మండపాలు ఏర్పాటు కావడంతో, భక్తులు విస్తారంగా పాల్గొంటున్నారు. వారాంతం కావడంతో ఆలయాలు, పండల్ల వద్ద భారీగా రద్దీ ఉంటుందని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
రాత్రి వేళల్లో సర్వీసులు అందుబాటులో ఉండడం వల్ల భక్తులు ప్రశాంతంగా దర్శనాలు ముగించుకుని, తమ ఇళ్లకు సులభంగా చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే ఆలస్యంగా రైళ్లు నడపడం ద్వారా భక్తులకు ఎక్కువ సమయం ఇవ్వడమే తమ లక్ష్యమని మెట్రో స్పష్టం చేసింది. భక్తులు ఎలాంటి తొందరపాటు లేకుండా, ఆరామంగా వినాయక దర్శనాలు చేసుకోవడానికి ఈ సౌకర్యం అందిస్తున్నాం” అని మెట్రో అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రత్యేక ఏర్పాటుతో, గణేశ్ ఉత్సవాల సమయంలో ప్రజలకు మరింత సౌకర్యం కలుగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్మెంట్కు స్వాగతం..!!
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్







