ఒమన్ లో ఈత కొడుతూ గుండెపోటుతో మరణించిన కేరళ వాసి..!!
- August 30, 2025
మస్కట్: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకు చెందిన ఒక భారతీయ ప్రవాసుడు శుక్రవారం మస్కట్లోని కల్బూహ్ పార్క్లో ఈత కొడుతూ తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన 45 ఏళ్ల భారతీయ ఇంజనీర్ కృష్ణ నాయర్గా గుర్తించారు.
కృష్ణ మస్కట్లోని ఒక ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తున్నాడు. స్విమ్మింగ్ కోచ్ తోపాటు ట్రెక్కింగ్ నిపుణుడిగా సెవలు అందిస్తున్నాడు. అతను ఖల్బూహ్ పార్క్లో వందలాది మంది పిల్లలు, నివాసితులకు ఈతలో శిక్షణ ఇచ్చాడు. అతని భార్య స్వప్న, కేరళ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు రఘురామ కృష్ణ మరియు పూర్ణిమ కృష్ణ ఉన్నారు.
కృష్ణ నాయర్ అకాల మరణానికి అలావి స్విమ్మింగ్ అకాడమీకి చెందిన డాక్టర్ సంఘవి మరియు ఇతరులు సంతాపం తెలిపారు. “మా ప్రియమైన యువ కెప్టెన్ కృష్ణ నాయర్ ఆకస్మిక మరణం మమ్మల్ని బాధపెట్టింది. మా దుఃఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. ఈ కోలుకోలేని నష్టాన్ని భరించడానికి ఆయన కుటుంబానికి శక్తిని ఇవ్వాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాము.” అని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ఆయన మృతదేహాన్ని కేరళకు స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్తలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్మెంట్కు స్వాగతం..!!
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్







