బహ్రెయిన్ విమానాశ్రయంలో 11% పెరిగిన ప్రయాణీకుల సంఖ్య..!!
- August 30, 2025
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల 11శాతం పెరిగింది. జూలై లో 865,753 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, జూన్లో ఈ సంఖ్య 780,000 గా ఉంది. ఈ మేరకు బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. నెలవారీ పెరుగుదల 85 వేల మంది ప్రయాణికులుగా ఉంది. ఇక బయలుదేరిన ప్రయాణికుల సంఖ్య 453,944కి చేరుకుంది.
8,748 విమాన సర్వీసులు నమోదయ్యాయి. దాదాపు 47,832 విమానాలు బహ్రెయిన్ వైమానిక ప్రాంతాన్ని వినియోగించుకున్నాయి. మొత్తం కార్గో మరియు ఎయిర్ మెయిల్ 35,129 టన్నులకు చేరుకుంది. వీటిలో 13,760 టన్నుల దిగుమతులు, 8,614 టన్నుల ఎగుమతులు ఉన్నాయి.
అత్యంత రద్దీ మార్గాల పరంగా చూస్తే..ఇండియాలోని బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల నుంచి 37,266 మంది ప్రయాణికులు ఉండగా, 117 శాతం పెరిగింది. అబుదాబి 31 శాతం పెరిగి 57,301 మంది ప్రయాణికులకు చేరుకోగా, దోహా 18 శాతం పెరిగి 54,101 మందికి చేరుకుంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







