బహ్రెయిన్ విమానాశ్రయంలో 11% పెరిగిన ప్రయాణీకుల సంఖ్య..!!
- August 30, 2025
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల 11శాతం పెరిగింది. జూలై లో 865,753 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, జూన్లో ఈ సంఖ్య 780,000 గా ఉంది. ఈ మేరకు బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. నెలవారీ పెరుగుదల 85 వేల మంది ప్రయాణికులుగా ఉంది. ఇక బయలుదేరిన ప్రయాణికుల సంఖ్య 453,944కి చేరుకుంది.
8,748 విమాన సర్వీసులు నమోదయ్యాయి. దాదాపు 47,832 విమానాలు బహ్రెయిన్ వైమానిక ప్రాంతాన్ని వినియోగించుకున్నాయి. మొత్తం కార్గో మరియు ఎయిర్ మెయిల్ 35,129 టన్నులకు చేరుకుంది. వీటిలో 13,760 టన్నుల దిగుమతులు, 8,614 టన్నుల ఎగుమతులు ఉన్నాయి.
అత్యంత రద్దీ మార్గాల పరంగా చూస్తే..ఇండియాలోని బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల నుంచి 37,266 మంది ప్రయాణికులు ఉండగా, 117 శాతం పెరిగింది. అబుదాబి 31 శాతం పెరిగి 57,301 మంది ప్రయాణికులకు చేరుకోగా, దోహా 18 శాతం పెరిగి 54,101 మందికి చేరుకుంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









