బహ్రెయిన్ విమానాశ్రయంలో 11% పెరిగిన ప్రయాణీకుల సంఖ్య..!!
- August 30, 2025
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల 11శాతం పెరిగింది. జూలై లో 865,753 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, జూన్లో ఈ సంఖ్య 780,000 గా ఉంది. ఈ మేరకు బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. నెలవారీ పెరుగుదల 85 వేల మంది ప్రయాణికులుగా ఉంది. ఇక బయలుదేరిన ప్రయాణికుల సంఖ్య 453,944కి చేరుకుంది.
8,748 విమాన సర్వీసులు నమోదయ్యాయి. దాదాపు 47,832 విమానాలు బహ్రెయిన్ వైమానిక ప్రాంతాన్ని వినియోగించుకున్నాయి. మొత్తం కార్గో మరియు ఎయిర్ మెయిల్ 35,129 టన్నులకు చేరుకుంది. వీటిలో 13,760 టన్నుల దిగుమతులు, 8,614 టన్నుల ఎగుమతులు ఉన్నాయి.
అత్యంత రద్దీ మార్గాల పరంగా చూస్తే..ఇండియాలోని బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల నుంచి 37,266 మంది ప్రయాణికులు ఉండగా, 117 శాతం పెరిగింది. అబుదాబి 31 శాతం పెరిగి 57,301 మంది ప్రయాణికులకు చేరుకోగా, దోహా 18 శాతం పెరిగి 54,101 మందికి చేరుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్మెంట్కు స్వాగతం..!!
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్







