దుబాయ్ లో 2 వేళ్లు కోల్పోయిన కార్మికుడికి Dh70,000 పరిహారం..!!
- August 30, 2025
యూఏఈ: దుబాయ్ కోర్టు కార్యాలయంలో జరిగిన ప్రమాదంలో 2 వేళ్లు కోల్పోయిన 32 ఏళ్ల కార్మికుడికి Dh70,000 పరిహారం చెల్లించారు. కాగా, సూపర్వైజర్లు, యజమానిని బాధ్యులుగా చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సదరు కార్మికుడు వర్క్షాప్లో స్టీల్-బెండింగ్ యంత్రం ఆపరేట్ చేసే సమయంలో ప్రమాదం జరిగింది.
కాగా, యంత్రాన్ని ఉపయోగించమని సూచించే ముందు కార్మికుడికి సరైన భద్రతా శిక్షణ లేదా మార్గదర్శకత్వం లభించలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి దుబాయ్ క్రిమినల్ కోర్టు గతంలో ఇద్దరు ఆసియా సూపర్వైజర్లను నిర్లక్ష్యంగా దోషులుగా నిర్ధారించింది. వారు తమ విధి నిర్వహణలో విఫలమయ్యారని తీర్పు చెప్పింది. వారికి ఒక నెల జైలు శిక్ష విధించింది. అయితే, శిక్షను మూడు సంవత్సరాల పాటు నిలిపివేసి, 5,000 దిర్హామ్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. పర్యవేక్షణ లేకపోవడం , భద్రతా ప్రోటోకాల్లను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టు తేల్చింది.
అయితే, గాయపడిన కార్మికుడు తనకు కలిగిన శారీరక వైకల్యం, వైద్య ఖర్చులు మరియు ఆర్థిక నష్టాలను పేర్కొంటూ 150,000 దిర్హామ్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ సివిల్ దావాను దాఖలు చేశాడు. సాక్ష్యాలు, వైద్య నివేదికలను సమీక్షించిన తర్వాత, సూపర్వైజర్లు మరియు కంపెనీ సంయుక్తంగా జరిగిన హానికి న్యాయమైన పరిహారంగా 70,000 దిర్హామ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







