600 ప్రాణాలు బలిగొన్న అఫ్గాన్ భూకంపం..
- September 01, 2025
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం, ఈ భూకంపం జలాలాబాద్ సమీపంలోని నంగర్హార్ ప్రావిన్స్లో కేంద్రీకృతమైంది. భూకంపం 8 కిలోమీటర్ల లోతులో, రాత్రి 11.47 గంటలకు సంభవించింది.
కునార్ ప్రావిన్స్ ఎక్కువగా ప్రభావితమైంది. భూకంపం తీవ్రతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మాజీ మేయర్ జరీఫా ఘఫ్ఫారీ మాట్లాడుతూ, “కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్స్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోవడంతో చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులకు ఆహారం, ఆశ్రయం అవసరం. తాలిబన్ ప్రభుత్వం సరిగా స్పందించలేకపోతోంది. అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలి” అని అన్నారు.
క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ భూకంపం తర్వాత 20 నిమిషాలకే 4.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







