600 ప్రాణాలు బలిగొన్న అఫ్గాన్ భూకంపం..
- September 01, 2025
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం, ఈ భూకంపం జలాలాబాద్ సమీపంలోని నంగర్హార్ ప్రావిన్స్లో కేంద్రీకృతమైంది. భూకంపం 8 కిలోమీటర్ల లోతులో, రాత్రి 11.47 గంటలకు సంభవించింది.
కునార్ ప్రావిన్స్ ఎక్కువగా ప్రభావితమైంది. భూకంపం తీవ్రతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మాజీ మేయర్ జరీఫా ఘఫ్ఫారీ మాట్లాడుతూ, “కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్స్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోవడంతో చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులకు ఆహారం, ఆశ్రయం అవసరం. తాలిబన్ ప్రభుత్వం సరిగా స్పందించలేకపోతోంది. అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలి” అని అన్నారు.
క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ భూకంపం తర్వాత 20 నిమిషాలకే 4.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్