అలయ్ బలయ్ వేడుకలకు రాష్ట్రపతిని ఆహ్వానించిన దత్తాత్రేయ
- September 01, 2025
న్యూ ఢిల్లీ: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ను సందర్శించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా హైదరాబాద్లో జరగనున్న ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 3న హైదరాబాద్లో నిర్వహించనున్న “అలయ్ బలయ్” కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకావాలని దత్తాత్రేయ కోరారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఉద్దేశాలు, ప్రాధాన్యతపై వివరమైన సమాచారం అందించారు.
అలయ్ బలయ్ పండుగ ప్రకృతి విలువల్ని ప్రతిబింబించేదిగా, విభిన్న ప్రజల మధ్య స్నేహాన్ని, ఐక్యతను పటిష్టం చేసే వేదికగా నిలుస్తుందని దత్తాత్రేయ వివరించారు. ఈ కార్యక్రమం వివిధ రంగాల ప్రముఖులను ఒకచోట చేర్చి మతసామరస్యాన్ని, సాంస్కృతిక ఐక్యతను చాటేదిగా ఉంటుంది.
బండారు దత్తాత్రేయ వివరాలను సంతోషంగా విన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలయ్ బలయ్ వంటి పౌర సంబంధాల కార్యక్రమాలు సామాజిక విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయం అని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







