ఖతార్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు..!!
- September 04, 2025
దోహా: ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థానీ అమిరి దివాన్లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీకి సంబంధించి 2012 నాటి చట్టం నంబర్ 8లోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టాన్ని సమీక్షించి, దానిని శాసనసభ సమీక్షకు సూచించాలని నిర్ణయించారు.
కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సామర్థ్యాలను పెంచడం కోసం నిర్దేశించిన ఒక ముసాయిదా క్యాబినెట్ తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ సవరణ మంత్రిత్వ శాఖలో కృత్రిమ మేధస్సు కోసం జాతీయ కేంద్రాన్ని స్థాపించడం, నిర్వహించడం ఉన్నాయి.
ఖతారీ కమ్యూనిటీ విలువలను పరిరక్షించడానికి ఉద్దేశించిన రక్షణ, విద్య, నివారణ, సాధికారత మరియు ఇతర పద్ధతులకు సంబంధించి సాధించిన ఫలితాలను క్యాబినెట్ సమీక్షిందని న్యాయ మంత్రి ఇబ్రహీం బిన్ అలీ అల్ మొహన్నది వివరించారు. ఫ్రెంచ్ రిపబ్లిక్ మరియు GCC దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి థర్డ్ విజన్ గోల్ఫ్ ఫోరమ్ ఫలితాలను కూడా క్యాబినెట్ సమీక్షిందని తెలిపారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!
- రియాద్ మీదుగా డ్రోన్లతో ఇరాన్ అటాక్..అడ్డుకున్న ఢిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!
- కువైట్ లో అదుపులో ఎయిర్ పోర్ట్ ఫ్యుయల్ ట్యాంక్ ఫైర్..!!
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు









