ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, పలువురికి గాయాలు..!!
- September 04, 2025
దుబాయ్: సోమవారం మధ్యాహ్నం ఎమిరేట్స్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక వాహనదారుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
షార్జాకు వెళ్లే మార్గంలో దుబాయ్ క్లబ్ బ్రిడ్జీ దాటగానే మూడు వాహనాల పరస్పరం ఢీకొన్నాయి. డ్రైవర్లు చాలా దగ్గరగా డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమాద ఫోటోలో ఒక సెడాన్ మరియు ఒక మినీ ట్రక్కు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక దర్యాప్తులో ఒక డ్రైవర్ ముందున్న వాహనం నుండి తగినంత దూరంలో లేడని ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని తమ విచారణలో తేలిందని దుబాయ్ పోలీసుల జనరల్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
దుబాయ్ రోడ్లలో తగినంత దూరం వదలకపోవడం వల్ల వెనుక నుండి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతాయని బ్రిగేడియర్ జుమా పేర్కొన్నారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టాల ప్రకారం.. ఇలాంటి నేరాలకు పాల్పడిన డ్రైవర్లకు 400 దిర్హామ్ల జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









