ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, పలువురికి గాయాలు..!!
- September 04, 2025
దుబాయ్: సోమవారం మధ్యాహ్నం ఎమిరేట్స్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక వాహనదారుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
షార్జాకు వెళ్లే మార్గంలో దుబాయ్ క్లబ్ బ్రిడ్జీ దాటగానే మూడు వాహనాల పరస్పరం ఢీకొన్నాయి. డ్రైవర్లు చాలా దగ్గరగా డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమాద ఫోటోలో ఒక సెడాన్ మరియు ఒక మినీ ట్రక్కు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక దర్యాప్తులో ఒక డ్రైవర్ ముందున్న వాహనం నుండి తగినంత దూరంలో లేడని ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని తమ విచారణలో తేలిందని దుబాయ్ పోలీసుల జనరల్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
దుబాయ్ రోడ్లలో తగినంత దూరం వదలకపోవడం వల్ల వెనుక నుండి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతాయని బ్రిగేడియర్ జుమా పేర్కొన్నారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టాల ప్రకారం.. ఇలాంటి నేరాలకు పాల్పడిన డ్రైవర్లకు 400 దిర్హామ్ల జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







