ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, పలువురికి గాయాలు..!!
- September 04, 2025
దుబాయ్: సోమవారం మధ్యాహ్నం ఎమిరేట్స్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక వాహనదారుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
షార్జాకు వెళ్లే మార్గంలో దుబాయ్ క్లబ్ బ్రిడ్జీ దాటగానే మూడు వాహనాల పరస్పరం ఢీకొన్నాయి. డ్రైవర్లు చాలా దగ్గరగా డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమాద ఫోటోలో ఒక సెడాన్ మరియు ఒక మినీ ట్రక్కు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక దర్యాప్తులో ఒక డ్రైవర్ ముందున్న వాహనం నుండి తగినంత దూరంలో లేడని ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని తమ విచారణలో తేలిందని దుబాయ్ పోలీసుల జనరల్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
దుబాయ్ రోడ్లలో తగినంత దూరం వదలకపోవడం వల్ల వెనుక నుండి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతాయని బ్రిగేడియర్ జుమా పేర్కొన్నారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టాల ప్రకారం.. ఇలాంటి నేరాలకు పాల్పడిన డ్రైవర్లకు 400 దిర్హామ్ల జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







