ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, పలువురికి గాయాలు..!!
- September 04, 2025
దుబాయ్: సోమవారం మధ్యాహ్నం ఎమిరేట్స్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక వాహనదారుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
షార్జాకు వెళ్లే మార్గంలో దుబాయ్ క్లబ్ బ్రిడ్జీ దాటగానే మూడు వాహనాల పరస్పరం ఢీకొన్నాయి. డ్రైవర్లు చాలా దగ్గరగా డ్రైవ్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమాద ఫోటోలో ఒక సెడాన్ మరియు ఒక మినీ ట్రక్కు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ప్రాథమిక దర్యాప్తులో ఒక డ్రైవర్ ముందున్న వాహనం నుండి తగినంత దూరంలో లేడని ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని తమ విచారణలో తేలిందని దుబాయ్ పోలీసుల జనరల్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
దుబాయ్ రోడ్లలో తగినంత దూరం వదలకపోవడం వల్ల వెనుక నుండి వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతాయని బ్రిగేడియర్ జుమా పేర్కొన్నారు. ఫెడరల్ ట్రాఫిక్ చట్టాల ప్రకారం.. ఇలాంటి నేరాలకు పాల్పడిన డ్రైవర్లకు 400 దిర్హామ్ల జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









