ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే బహిష్కరణ వేటే..!!
- September 04, 2025
రియాద్: ప్రజా భద్రతకు హాని కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తుది కోర్టు తీర్పు జారీ చేస్తే సౌదీయేతరులను బహిష్కరించాలని నిర్దేశించే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలను ఆమోదించారు. ఇలా బహిష్కరించబడినవారు రాజ్యంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడతారని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కొత్త విధానాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో అమలు చేయబడుతుందన్నారు. తాజా సవరణలలో ప్రజా భద్రతకు హాని కలిగించే ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఒక వ్యక్తి మొదటి ఉల్లంఘన చేసిన ఒక సంవత్సరం లోపు రెండవసారి ఉల్లంఘనకు పాల్పడితే గరిష్ఠస్థాయిలో జరిమానా విధించబడుతుందని వెల్లడించారు. అదే మూడవసారి ఉల్లంఘన పునరావృతమైతే, రెండవ ఉల్లంఘనకు విధించిన జరిమానాను రెట్టింపు చేస్తారని, అలాతే సదరు వ్యక్తికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









