ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే బహిష్కరణ వేటే..!!
- September 04, 2025
రియాద్: ప్రజా భద్రతకు హాని కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తుది కోర్టు తీర్పు జారీ చేస్తే సౌదీయేతరులను బహిష్కరించాలని నిర్దేశించే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలను ఆమోదించారు. ఇలా బహిష్కరించబడినవారు రాజ్యంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడతారని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కొత్త విధానాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో అమలు చేయబడుతుందన్నారు. తాజా సవరణలలో ప్రజా భద్రతకు హాని కలిగించే ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఒక వ్యక్తి మొదటి ఉల్లంఘన చేసిన ఒక సంవత్సరం లోపు రెండవసారి ఉల్లంఘనకు పాల్పడితే గరిష్ఠస్థాయిలో జరిమానా విధించబడుతుందని వెల్లడించారు. అదే మూడవసారి ఉల్లంఘన పునరావృతమైతే, రెండవ ఉల్లంఘనకు విధించిన జరిమానాను రెట్టింపు చేస్తారని, అలాతే సదరు వ్యక్తికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









