ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే బహిష్కరణ వేటే..!!
- September 04, 2025
రియాద్: ప్రజా భద్రతకు హాని కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తుది కోర్టు తీర్పు జారీ చేస్తే సౌదీయేతరులను బహిష్కరించాలని నిర్దేశించే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలను ఆమోదించారు. ఇలా బహిష్కరించబడినవారు రాజ్యంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడతారని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కొత్త విధానాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో అమలు చేయబడుతుందన్నారు. తాజా సవరణలలో ప్రజా భద్రతకు హాని కలిగించే ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఒక వ్యక్తి మొదటి ఉల్లంఘన చేసిన ఒక సంవత్సరం లోపు రెండవసారి ఉల్లంఘనకు పాల్పడితే గరిష్ఠస్థాయిలో జరిమానా విధించబడుతుందని వెల్లడించారు. అదే మూడవసారి ఉల్లంఘన పునరావృతమైతే, రెండవ ఉల్లంఘనకు విధించిన జరిమానాను రెట్టింపు చేస్తారని, అలాతే సదరు వ్యక్తికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







