ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే బహిష్కరణ వేటే..!!
- September 04, 2025
రియాద్: ప్రజా భద్రతకు హాని కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తుది కోర్టు తీర్పు జారీ చేస్తే సౌదీయేతరులను బహిష్కరించాలని నిర్దేశించే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలను ఆమోదించారు. ఇలా బహిష్కరించబడినవారు రాజ్యంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడతారని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కొత్త విధానాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో అమలు చేయబడుతుందన్నారు. తాజా సవరణలలో ప్రజా భద్రతకు హాని కలిగించే ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఒక వ్యక్తి మొదటి ఉల్లంఘన చేసిన ఒక సంవత్సరం లోపు రెండవసారి ఉల్లంఘనకు పాల్పడితే గరిష్ఠస్థాయిలో జరిమానా విధించబడుతుందని వెల్లడించారు. అదే మూడవసారి ఉల్లంఘన పునరావృతమైతే, రెండవ ఉల్లంఘనకు విధించిన జరిమానాను రెట్టింపు చేస్తారని, అలాతే సదరు వ్యక్తికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







