ట్రాఫిక్ పర్యవేక్షణకు హెలికాప్టర్లు, అధునాతన కెమెరాలు..!!
- September 04, 2025
కువైట్: కువైట్ లో2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను ప్రకటించింది. స్కూల్ సమయాల్లో ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి దాదాపు 300 ట్రాఫిక్, రెస్క్యూ మరియు పబ్లిక్ సెక్యూరిటీ గస్తీ బృందాలను మోహరించనున్నట్టు పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ అల్-దవాస్ తెలిపారు. వీటితోపాటు ట్రాఫిక్ రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు మరియు అధునాతన నిఘా కెమెరాలను ఉపయోగించనున్నట్లు ఆయన వివరించారు.
ఉదయం 6:00 నుండి 8:30 వరకు మరియు మధ్యాహ్నం 12:00 నుండి 2:30 వరకు రెండు షిఫ్టులలో ఈ గస్తీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ముఖ్యంగా సబా అల్-సేలం, హవల్లీ, జాబ్రియా, ఫర్వానియా, అల్-రక్కా మరియు సల్వా వంటి కీలక ప్రాంతాలపై ఫోకస్ అధికంగా ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









