ట్రాఫిక్ పర్యవేక్షణకు హెలికాప్టర్లు, అధునాతన కెమెరాలు..!!
- September 04, 2025
కువైట్: కువైట్ లో2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను ప్రకటించింది. స్కూల్ సమయాల్లో ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి దాదాపు 300 ట్రాఫిక్, రెస్క్యూ మరియు పబ్లిక్ సెక్యూరిటీ గస్తీ బృందాలను మోహరించనున్నట్టు పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ అల్-దవాస్ తెలిపారు. వీటితోపాటు ట్రాఫిక్ రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు మరియు అధునాతన నిఘా కెమెరాలను ఉపయోగించనున్నట్లు ఆయన వివరించారు.
ఉదయం 6:00 నుండి 8:30 వరకు మరియు మధ్యాహ్నం 12:00 నుండి 2:30 వరకు రెండు షిఫ్టులలో ఈ గస్తీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ముఖ్యంగా సబా అల్-సేలం, హవల్లీ, జాబ్రియా, ఫర్వానియా, అల్-రక్కా మరియు సల్వా వంటి కీలక ప్రాంతాలపై ఫోకస్ అధికంగా ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







