ట్రాఫిక్ పర్యవేక్షణకు హెలికాప్టర్లు, అధునాతన కెమెరాలు..!!
- September 04, 2025
కువైట్: కువైట్ లో2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను ప్రకటించింది. స్కూల్ సమయాల్లో ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి దాదాపు 300 ట్రాఫిక్, రెస్క్యూ మరియు పబ్లిక్ సెక్యూరిటీ గస్తీ బృందాలను మోహరించనున్నట్టు పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ అల్-దవాస్ తెలిపారు. వీటితోపాటు ట్రాఫిక్ రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు మరియు అధునాతన నిఘా కెమెరాలను ఉపయోగించనున్నట్లు ఆయన వివరించారు.
ఉదయం 6:00 నుండి 8:30 వరకు మరియు మధ్యాహ్నం 12:00 నుండి 2:30 వరకు రెండు షిఫ్టులలో ఈ గస్తీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ముఖ్యంగా సబా అల్-సేలం, హవల్లీ, జాబ్రియా, ఫర్వానియా, అల్-రక్కా మరియు సల్వా వంటి కీలక ప్రాంతాలపై ఫోకస్ అధికంగా ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









