ట్రాఫిక్ పర్యవేక్షణకు హెలికాప్టర్లు, అధునాతన కెమెరాలు..!!
- September 04, 2025
కువైట్: కువైట్ లో2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను ప్రకటించింది. స్కూల్ సమయాల్లో ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి దాదాపు 300 ట్రాఫిక్, రెస్క్యూ మరియు పబ్లిక్ సెక్యూరిటీ గస్తీ బృందాలను మోహరించనున్నట్టు పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ అల్-దవాస్ తెలిపారు. వీటితోపాటు ట్రాఫిక్ రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు మరియు అధునాతన నిఘా కెమెరాలను ఉపయోగించనున్నట్లు ఆయన వివరించారు.
ఉదయం 6:00 నుండి 8:30 వరకు మరియు మధ్యాహ్నం 12:00 నుండి 2:30 వరకు రెండు షిఫ్టులలో ఈ గస్తీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ముఖ్యంగా సబా అల్-సేలం, హవల్లీ, జాబ్రియా, ఫర్వానియా, అల్-రక్కా మరియు సల్వా వంటి కీలక ప్రాంతాలపై ఫోకస్ అధికంగా ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







