దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త చెకింగ్ టెక్నాలజీ..!!
- September 04, 2025
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)లో ప్రయాణికులు ఇక తమ ల్యాప్ టాప్ లు బ్యాగు నుంచి తీయాల్సి పనిలేదు. వాటర్ బాటిల్స్ పడేయాల్సిన అవసరం ఉండదు. ఇవేవి లేకుండానే ఎంచక్కా సెక్యూరిటీ చెకింగ్ ను పూర్తి చేయవచ్చు.
ఇప్పటికే ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ మరియు హోల్డ్ బ్యాగేజ్ సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలను దశలవారీగా తొలగిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయాల టెర్మినల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ షంసి తెలిపారు. దీని స్థానంలో కొత్త బ్యాగేజీ చెకింగ్ టెక్నాలజీ 2026 చివరి వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీ మీ బ్యాగ్ నుండి ఏమీ తీయవలసిన అవసరం లేకుండానే సెక్యూరిటీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.
ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణీకులు ల్యాప్టాప్లు, పెర్ఫ్యూమ్లు, క్రీమ్లు మరియు 100ml కంటే ఎక్కువ లిక్విడ్స్ ఉన్న వస్తువులను స్కానింగ్ చేసే కొత్త ఏఐ స్కానర్లను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. 2025 మొదటి 6 నెలల్లో ఎయిర్ పోర్టు 46 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిందని, ఏటా ప్రయాణికుల సంఖ్య 2.3 శాతం పెరుగుతుందని అల్ షంసి వివరించారు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







