దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త చెకింగ్ టెక్నాలజీ..!!
- September 04, 2025
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)లో ప్రయాణికులు ఇక తమ ల్యాప్ టాప్ లు బ్యాగు నుంచి తీయాల్సి పనిలేదు. వాటర్ బాటిల్స్ పడేయాల్సిన అవసరం ఉండదు. ఇవేవి లేకుండానే ఎంచక్కా సెక్యూరిటీ చెకింగ్ ను పూర్తి చేయవచ్చు.
ఇప్పటికే ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ మరియు హోల్డ్ బ్యాగేజ్ సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలను దశలవారీగా తొలగిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయాల టెర్మినల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ షంసి తెలిపారు. దీని స్థానంలో కొత్త బ్యాగేజీ చెకింగ్ టెక్నాలజీ 2026 చివరి వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీ మీ బ్యాగ్ నుండి ఏమీ తీయవలసిన అవసరం లేకుండానే సెక్యూరిటీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.
ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణీకులు ల్యాప్టాప్లు, పెర్ఫ్యూమ్లు, క్రీమ్లు మరియు 100ml కంటే ఎక్కువ లిక్విడ్స్ ఉన్న వస్తువులను స్కానింగ్ చేసే కొత్త ఏఐ స్కానర్లను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. 2025 మొదటి 6 నెలల్లో ఎయిర్ పోర్టు 46 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిందని, ఏటా ప్రయాణికుల సంఖ్య 2.3 శాతం పెరుగుతుందని అల్ షంసి వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









